ఆలయంలో మొబైల్ కౌంటర్ పేరుతో భక్తులపై దురుసు ప్రవర్తన. చోద్యం చూస్తున్న ఈవో..
NTODAY NEWS అన్నమయ్య జిల్లా పుంగనూరు చౌడేపల్లి (మండలం ) దిగుపల్లిలో వెలిసిన మహిమాన్విత శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులు నిరోధోపిడికి నిదర్శనంగా నిలుస్తున్నదని భక్తులు వాపోయారు.
మదనపల్లికి చెందిన వెంకటేష్ అనే భక్తుడు మంగళవారం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారి దర్శనానికి భక్తులతో ఆలయానికి వచ్చారు. మెట్ల మార్గాన ఆలయంలో ఏర్పాటుచేసిన మొబైల్ కౌంటర్ వద్ద ఆలయంలో అమ్మవారి దర్శనార్థం తమ బంధువులు వృద్ధులు వస్తున్నారని, బంధువులు వచ్చేంతవరకు ఫోను తమ వద్ద ఉంచుకుంటామని తెలియజేయడంతో అక్కడ మొబైల్ కౌంటర్ లోని కాంట్రాక్ట్ వర్కర్ లు మొబైల్ అప్పగించి మెట్లు వద్ద నిలబడాలని మొబైల్ కౌంటర్ వారు వాగ్వివాదానికి దిగారు.అసలు బోయకొండ గంగమ్మ ఆలయం అభివృద్ధి పేరు తో ఈఓ ఏకంబరం ఇష్టాను సారంగా కొత్త రూల్ లతో భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, బోయకొండ కు వాహనం లో మొదట 100రూ.తోల్గేట్ చెల్లించి అక్కడ నుండి మొదలై ఆలయం అమ్మవారి దర్శనార్థం మొబైల్ కౌంటర్లో పది రూపాయలు చెల్లించి 500, 200,100రూపాయలు స్పెషల్ దర్శనాలంటూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారని ప్రతి ఒక్క దాని కి అడ్డగోలుగా వసులకు పాల్పడుతున్నారని భక్తులు వాపోయారు.దేవాదాయ శాఖ వారు ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇష్టానుసారం కాంట్రాక్టులో ఇప్పించి భక్తులను నిరుదోపిడి చేస్తున్నారని, భక్తులు వాపోతున్నారు.నిత్యం అమ్మవారి దర్శనం కోసం సాధారణ భక్తులు అమ్మవారిని దర్శించుకునే హక్కు కోల్పోతున్నామని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దీనిపైన చొరవ తీసుకొని వెంటనే ఇలాంటి అక్రమ వసూలు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు.