BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

రంజాన్ ఎఫెక్ట్… ఎస్‌ఎస్‌సి పరీక్ష షాక్ మార్పు!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 06:40 AM
103 వీక్షణలు

రంజాన్ ఎఫెక్ట్… ఎస్‌ఎస్‌సి పరీక్ష షాక్ మార్పు!  21న ఉండాల్సిన ఇంగ్లీష్ పరీక్ష ఏప్రిల్ 2కు వాయిదా

విజయవాడ, మార్చి 20: రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) సందర్భంగా 21-03-2026న ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించడంతో, అదే రోజు నిర్వహించాల్సిన ఎస్‌ఎస్‌సి 3వ భాష ఇంగ్లీష్ పరీక్ష (పేపర్ కోడ్‌లు 13E & 14E)ను అకస్మాత్తుగా వాయిదా వేశారు.

విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొనకుండా ఉండేందుకు అధికారులు వెంటనే స్పష్టత ఇచ్చారు. వాయిదా పడిన ఈ పరీక్షను 02-04-2026 (గురువారం) ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది.

జిల్లా విద్యాశాఖాధికారులకు అత్యవసర ఆదేశాలు జారీ కాగా, ఈ మార్పును గ్రామ స్థాయి వరకు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు సహా అందరికీ సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అదేవిధంగా, ఏప్రిల్ 2న పరీక్ష నిర్వహణలో ఎలాంటి అంతరాయం లేకుండా పరీక్షా కేంద్రాల సిద్ధత, సిబ్బంది నియామకం, ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఇక 21-03-2026న విధులకు నియమించబడిన ఇన్విజిలేటర్లు, అదే విధంగా 02-04-2026న కూడా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, దీనికి సంబంధించిన సవరణ ఉత్తర్వులు త్వరలో జారీ చేయనున్నట్లు తెలిపారు.

ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.