BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

భార్యపై అనుమానం… వ్యక్తిపై గొడ్డలితో హత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 09:57 PM
101 వీక్షణలు

భార్యపై అనుమానం… వ్యక్తిపై గొడ్డలితో హత్యాయత్నం  నిందితుడు అరెస్ట్ –  ఆస్పత్రిలో చికిత్సలో బాధితుడు

ఎన్టీఆర్ జిల్లా, ఏ.కొండూరు: మండలంలోని పెద్దతండా గ్రామ శివార్లలో జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏ.కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు చేసిన క్రైమ్ నెంబర్ 21/2026, U/S 109 బిఎన్‌ఎస్ కేసుకు సంబంధించి లావూరి సీతారాం (37)ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం… కుటుంబ సమస్యలు, భార్యపై అనుమానం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. తన భార్యకు చీమలపాడు గ్రామానికి చెందిన పాఠాపంచల జమలయ్య (40)తో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో సీతారాం తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో బాధితుడిపై ద్వేషం పెంచుకొని ముందుగా ప్రణాళిక ప్రకారం దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఘటన జరిగిన రోజు పెద్దతండా గ్రామ శివార్లలోని ఎన్‌ఎస్‌పీ కాలువ సమీపంలో బాధితుడిని అడ్డగించి, తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో బాధితుడు తలకు, శరీరంలోని పలు భాగాలకు తీవ్ర గాయాలు పొందడంతో స్పృహ కోల్పోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

విచారణలో భాగంగా నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని చట్టపరమైన విధానంలో అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు సూచిస్తూ… వ్యక్తిగత వివాదాలను హింసాత్మక మార్గాల్లో కాకుండా చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.