BREAKING
ధాన్యం దిగుమతి నిబంధనల ప్రకారమే జరగాలి: జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు ద్రావిడ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి: సర్పంచ్ ఆవల సుందర్ ​చిన్నారుల భవిష్యత్తుకు అంగన్‌వాడీ బంగారు బాట ​నిబంధనల ప్రకారమే వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి చిట్యాలలో రైతు అవగాహన సదస్సు ​ప్రపంచ దేశాలకు ఆదర్శం మన ప్రజాస్వామ్యం బాకీ వివాదం.. వివాహిత హత్య.. పరిశుభ్రమైన రాయచోటి నిర్మాణమే లక్ష్యం తెలంగాణ ఉద్యమకారుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పల్లపు బుద్ధుడు నియామకం ధాన్యం దిగుమతి నిబంధనల ప్రకారమే జరగాలి: జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు ద్రావిడ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి: సర్పంచ్ ఆవల సుందర్ ​చిన్నారుల భవిష్యత్తుకు అంగన్‌వాడీ బంగారు బాట ​నిబంధనల ప్రకారమే వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి చిట్యాలలో రైతు అవగాహన సదస్సు ​ప్రపంచ దేశాలకు ఆదర్శం మన ప్రజాస్వామ్యం బాకీ వివాదం.. వివాహిత హత్య.. పరిశుభ్రమైన రాయచోటి నిర్మాణమే లక్ష్యం తెలంగాణ ఉద్యమకారుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పల్లపు బుద్ధుడు నియామకం
www.ntodaynews.com

భావోద్వేగాల నడుమ ముగ్గురు ఏఎస్ఐల పదవీ విరమణ.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 May, 2026 - 07:08 PM
13 వీక్షణలు

మదనపల్లి,  సమాజ రక్షణ కోసం అంకితభావంతో పనిచేసి పదవీ విరమణ పొందిన పోలీసు అధికారుల సేవలు చిరస్మరణీయమని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు కొనియాడారు. శనివారం పోలీసు సమావేశ మందిరంలో ఏఎస్ఐలు ఎస్. మాబూ సాహెబ్, పి. వెంకటరమణ, మరియు ఎం. శేఖర్ రావులకు 'ఆత్మీయ వీడ్కోలు' కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ, పోలీసు అధికారుల సుదీర్ఘ సర్వీసులో వారి జీవిత భాగస్వాముల సహకారం, చేసిన త్యాగాలు వెలకట్టలేనివని అభినందించారు. శేష జీవితాన్ని కుటుంబంతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ పొందిన వారికి జ్ఞాపికలను అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని, పోలీసు శాఖ ఎప్పుడూ ఒకే కుటుంబమని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎం. వెంకటాద్రి గారు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.