భద్రాచలం నుండి చనుబండకు కళ్యాణ తలంబ్రాలు
భద్రాచలం నుండి చనుబండకు కళ్యాణ తలంబ్రాలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి భద్రాచలం నుండి పవిత్ర కళ్యాణ తలంబ్రాలు చేరాయి.
భద్రాచలం శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం నుండి తీసుకువచ్చిన ఈ తలంబ్రాలను మార్చి 23, 2026న చనుబండ గ్రామానికి ప్రత్యేకంగా తరలించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి, వేగా జ్యువెలరీ అధినేత వనమాకేశవ రావు, పుచ్చకాయల భాస్కర్ రెడ్డి, మిట్టపల్లి వెంకటేశ్వరరావు, వంకదారు రాము తదితరులు పాల్గొన్నారు.
గ్రామస్థులు గోతితో వలిచిన తలంబ్రాలతో కలిసి ఈ పవిత్ర తలంబ్రాలను రాబోయే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో వినియోగించనున్నట్లు ఆలయ ధర్మకర్త చెన్నకేశవరెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా చనుబండ మరియు పరిసర గ్రామాలలో భక్తి వాతావరణం నెలకొంది.