www.ntodaynews.com
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
ఆంధ్రప్రదేశ్
/
విజయనగరం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.
ప్రధాని మోడీ సుమారు 15 నిమిషాల పాటు విమానాశ్రయాన్ని పరిశీలించారు. అనంతరం ఓపెన్టాప్ కారులో ప్రయాణిస్తూ ఉత్తరాంధ్ర సాంప్రదాయ థింసా నృత్యాన్ని తిలకించారు. ఈ సందర్భంగా రికార్డు స్థాయిలో 13,500 మంది కళాకారులు థింసా నృత్య ప్రదర్శన ఇచ్చారు.
కార్యక్రమం ముగింపులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీకి ఉత్తరాంధ్ర సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బొబ్బిలి వీణను బహూకరించారు.