BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

భూమిలో అక్రమంగా రహదారి వేసి అడ్డుకుంటున్నారని రైతు కుటుంబం ఆరోపణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Jun, 2026 - 06:09 AM
19 వీక్షణలు

అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన పోలవరపు రమాదేవి, భర్త దయాకరరావు తమ వ్యవసాయ భూమిలో అక్రమంగా రహదారి నిర్మించి, దానిని తొలగించే ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, యల్లాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో తమకు 2 ఎకరాల 20 సెంట్ల వ్యవసాయ భూమి ఉందని, అందులో పామాయిల్ తోట సాగు చేస్తున్నామని తెలిపారు. తమ భూమి సరిహద్దులో ఉన్న ఇరిగేషన్ కాలువపై కొందరు రైతులు పైపులు వేసి, అనుమతి లేకుండా భూమిలోకి రహదారి ఏర్పాటు చేశారని ఆరోపించారు.

ఈ విషయాన్ని గుర్తించిన అనంతరం శుక్రవారం జేసీబీ సహాయంతో ఆ రహదారిని తొలగించి గట్టు నిర్మించే పనులు చేపట్టగా, మల్లినేని మురళీ, మూతినేని ప్రభాకర్, మూతినేని కిషోర్‌తో పాటు పక్క తోట కౌలు రైతు కలిసి పనులను అడ్డుకున్నారని తెలిపారు. జేసీబీకి నష్టం కలిగించడంతో పాటు సామాన్లు దొంగిలించారని, వాహనాన్ని వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.

తమ భూమిలో పనులు నిలిపివేయడమే కాకుండా ప్రశ్నించినందుకు దురుసుగా ప్రవర్తించి బెదిరింపులకు పాల్పడ్డారని, తల్లిని నెట్టివేసి ఇబ్బందులకు గురిచేశారని బాధితులు వాపోయారు.

ఈ ఘటనపై రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు శాఖలు వెంటనే స్పందించి విచారణ జరిపి న్యాయం చేయాలని బాధిత కుటుంబం మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది.

వ్యక్తిగత భూమిలో అక్రమ రహదారి ఏర్పాటు, తొలగింపు పనులను అడ్డుకున్నారనే ఆరోపణలతో ఈ ఘటన ముసునూరు మండలంలో చర్చనీయాంశంగా మారింది. అధికారులు సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.