BREAKING
ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం
www.ntodaynews.com

భూమిలో దాచిన రూ.5 లక్షలకు చెదలు.. రైతుకు ఊహించని షాక్!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Aug, 2026 - 10:58 AM
27 వీక్షణలు

భూమిలో దాచిన రూ.5 లక్షలకు చెదలు.. రైతుకు ఊహించని షాక్!

బాలోత్రా: దొంగల భయంతో భూమిలో దాచిన డబ్బు.. ఏళ్ల తర్వాత బయటపడటంతో ఆ రైతుకు ఊహించని షాక్ ఎదురైంది. రాజస్థాన్‌లోని బాలోత్రాకు చెందిన రైతు మంగీలాల్‌ ఒక ప్లాట్‌ను విక్రయించగా వచ్చిన సుమారు రూ.5 లక్షలను ఇంట్లో ఉంచితే చోరీకి గురవుతాయనే భయంతో నేలలో రహస్యంగా దాచినట్లు తెలుస్తోంది.

అయితే ఆ తర్వాత ఆ డబ్బును దాచిన ప్రదేశాన్ని మంగీలాల్‌ మరిచిపోయాడు. కొంతకాలం తర్వాత జరిగిన తవ్వకాల్లో అనుకోకుండా ఆ నగదు బయటపడింది. డబ్బు చేతికి దొరికిందన్న ఆనందం క్షణాల్లోనే ఆవిరైంది. నేలలో ఎక్కువకాలం ఉండటంతో నోట్లను చెదలు తీవ్రంగా దెబ్బతీశాయి. కొన్ని నోట్లు పూర్తిగా దెబ్బతినగా, వాటిపై ఉన్న సీరియల్‌ నంబర్లు కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి ఏర్పడింది.

దెబ్బతిన్న నోట్లను మార్చుకునేందుకు బ్యాంకును ఆశ్రయించిన మంగీలాల్‌కు మరో నిరాశ ఎదురైనట్లు సమాచారం. నోట్ల పరిస్థితి, వాటి వివరాలు స్పష్టంగా లేకపోవడంతో వాటిని స్వీకరించేందుకు బ్యాంకు అధికారులు నిరాకరించినట్లు చెబుతున్నారు.

దీంతో చేతికి దొరికిన రూ.5 లక్షలు కళ్లముందే పనికిరాకుండా పోయే పరిస్థితి రావడంతో రైతు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దొంగల నుంచి కాపాడాలని భూమిలో దాచిన నగదే చివరకు చెదల పాలవడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.