BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

తిరుమల లడ్డూ వ్యవహారంపై బీజేపీ నేత డిమాండ్

తెలంగాణ
06 Feb, 2026 - 06:36 AM
97 వీక్షణలు
తిరుమల లడ్డూ వ్యవహారంపై బీజేపీ నేత వ్యాఖ్యలు – మాజీ సీఎం క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ NTODAY NEWS: గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి  తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమిలో భాగంగా ఈ అంశంపై ఖండన కార్యక్రమం నిర్వహించినట్లు బీజేపీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అత్యంత పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో నెయ్యి విషయంలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని, అలాంటి ప్రసాదంపై ఈ తరహా ఆరోపణలు రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ ఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే జరిగిందని పేర్కొంటూ, అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఈ అంశంపై బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో మాజీ సీఎం ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కాకపోయినా, ఆయన పాలనలోనే జరిగిందని చెబుతూ, సీఎం హోదాలో ఉన్న వ్యక్తిగా హుందాగా స్పందించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని చిట్టా మధు కోరారు. ఈ లడ్డూ కల్తీ వ్యవహారం పై ప్రస్తుతం రాజకీయ పార్టీల మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై సంబంధిత అధికారిక సంస్థల నుంచి స్పష్టమైన నివేదికలు రావాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై ఇతర పార్టీల స్పందన ఇంకా రావాల్సి ఉంది. #Ntodaynews, #Tirumala Laddu, #BJP, #Chitta Madhu, #YSRCP, #Jagan Mohan Reddy, #Political News, #Andhra Pradesh Follow us on Website Facebook Instagram YouTube