ముఖ్యమంత్రి హిందూ దేవతలపై చేసిన అవమానకర వ్యాఖ్యలను ఖండిస్తూ... బీజేపీ గడ్డిఅన్నారం డివిజన్ నిరసన
NTODAY NEWS: ఎల్బీనగర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవీ–దేవతలు, హిందూ సమాజంపై చేసిన అవమానకర వ్యాఖ్యలు, వ్యంగ్య భాష హిందువుల భావోద్వేగాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఖండించారు. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పిలుపుమేరకు ఈ హిందూ ద్వేషపూరిత ధోరణికి నిరసనగా, బుధవారం ఉదయం గడ్డిఅన్నారం డివిజన్ కమలానగర్ చౌరస్తా వద్ద బీజేపీ గడ్డిఅన్నారం డివిజన్ అధ్యక్షుడు దాసరి జయప్రకాష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి హాజరై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు . సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్.అంటూ తీవ్రంగా నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మరియు బీజేపీ కార్యకర్తలను సరూర్నగర్ పోలీస్ సిబ్బంది అదుపులోకి తీసుకుని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. హిందూ ధర్మాన్ని అవమానించే వ్యాఖ్యలు, హిందూ సమాజాన్ని చేసే చర్యలపై బీజేపీగా ఎప్పటికప్పుడు పోరాటం కొనసాగిస్తామని కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఏనుగు శ్రీధర్ రెడ్డి, మురళి, చిలకూరి మధుసూదన్ రెడ్డి, బాబు చౌదరి, రాజు, సిరి రెడ్డి, అమంచి శ్రీనివాస్, సిద్దు, వంశీ యాదవ్, టీంకు మరియు తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube