చాట్రాయి ఏఎస్సై వంగాల మాధవరెడ్డి కన్నుమూత
చాట్రాయి ఏఎస్సై వంగాల మాధవరెడ్డి కన్నుమూత
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్న వంగాల మాధవరెడ్డి ఆకస్మికంగా కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించి ఈ రోజు తుదిశ్వాస విడిచారు.
చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన మాధవరెడ్డి, కొంతకాలంగా చింతలపూడిలో నివాసం ఉంటూ విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే అధికారిగా మంచి పేరును సంపాదించారు.
ఆయన మృతితో పోలీసు శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ, సిబ్బంది మాధవరెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే నూజివీడు రూరల్ సీఐ కె. రామకృష్ణ, చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణలు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
మాధవరెడ్డి మృతిపై స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.