BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 02 April 2026, 05:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి ఏఎస్సై వంగాల మాధవరెడ్డి కన్నుమూత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 05:04 PM
434 వీక్షణలు

చాట్రాయి ఏఎస్సై వంగాల మాధవరెడ్డి కన్నుమూత

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న వంగాల మాధవరెడ్డి ఆకస్మికంగా కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించి ఈ రోజు తుదిశ్వాస విడిచారు.

చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన మాధవరెడ్డి, కొంతకాలంగా చింతలపూడిలో నివాసం ఉంటూ విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే అధికారి‌గా మంచి పేరును సంపాదించారు.

ఆయన మృతితో పోలీసు శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ, సిబ్బంది మాధవరెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే నూజివీడు రూరల్ సీఐ కె. రామకృష్ణ, చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణలు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

మాధవరెడ్డి మృతిపై స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.