BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

చాట్రాయి ఏఎస్సై వంగాల మాధవరెడ్డి కన్నుమూత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 05:04 PM
356 వీక్షణలు

చాట్రాయి ఏఎస్సై వంగాల మాధవరెడ్డి కన్నుమూత

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న వంగాల మాధవరెడ్డి ఆకస్మికంగా కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించి ఈ రోజు తుదిశ్వాస విడిచారు.

చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన మాధవరెడ్డి, కొంతకాలంగా చింతలపూడిలో నివాసం ఉంటూ విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే అధికారి‌గా మంచి పేరును సంపాదించారు.

ఆయన మృతితో పోలీసు శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ, సిబ్బంది మాధవరెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే నూజివీడు రూరల్ సీఐ కె. రామకృష్ణ, చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణలు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

మాధవరెడ్డి మృతిపై స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.