www.ntodaynews.com
చాట్రాయి మండలంలో నాలుగు గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చాట్రాయి మండలంలో నాలుగు గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో బళ్ళా రాజు బాధ్యతలు స్వీకరణ
చాట్రాయి మండలం: శుక్రవారం అనగా 03-04-2026 ఉదయం పోలవరం, నరసింహారావుపాలెం, చనుబండ, కృష్ణారావుపాలెం గ్రామ పంచాయతీలకు గ్రామ ప్రత్యేక అధికారిగా నియమితులైన ఎంపీడీవో చాట్రాయి విధుల్లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల సమగ్ర అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరవేసే దిశగా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
గ్రామస్థులతో సమన్వయం సాధిస్తూ, ప్రాథమిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి సారిస్తానని, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు.