BREAKING
ఆగస్టు 13న తాడేపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు.. DSC 2025, నిరుద్యోగ సమస్యలపై ఆత్మకూరులో ర్యాలీ, రాస్తారోకో విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కడెం ఆయకట్టు నీటి విడుదలపై BRS, BJP అసత్య ప్రచారం Cm నాగార్జునసాగర్ పర్యటనలో డీవైఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ నేతల అరెస్ట్ 4 లేబర్ కోడ్లపై కార్మికుల తిరుగుబాటు సంతోష్‌నగర్‌లో రాస్తారోకో.. కార్మికుల అరెస్ట్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుతున్న సర్పంచ్ దేశవ్యాప్తంగా జైల్‌ భరో, రాస్తారోకో, రైల్‌రోకో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి ఆగస్టు 13న తాడేపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు.. DSC 2025, నిరుద్యోగ సమస్యలపై ఆత్మకూరులో ర్యాలీ, రాస్తారోకో విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కడెం ఆయకట్టు నీటి విడుదలపై BRS, BJP అసత్య ప్రచారం Cm నాగార్జునసాగర్ పర్యటనలో డీవైఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ నేతల అరెస్ట్ 4 లేబర్ కోడ్లపై కార్మికుల తిరుగుబాటు సంతోష్‌నగర్‌లో రాస్తారోకో.. కార్మికుల అరెస్ట్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుతున్న సర్పంచ్ దేశవ్యాప్తంగా జైల్‌ భరో, రాస్తారోకో, రైల్‌రోకో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి
www.ntodaynews.com

చాట్రాయి మండలంలో విద్యుత్‌ విజిలెన్స్‌ విస్తృత తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Aug, 2026 - 10:36 AM
80 వీక్షణలు

ఏలూరు జిల్లా, నూజివీడు: చాట్రాయి మండలంలో ఏపీసీపీడీసీఎల్‌ విజిలెన్స్‌ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. విద్యుత్‌ వినియోగంలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు విజిలెన్స్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మండలంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లను, వాణిజ్య సంస్థలను, విద్యుత్‌ వినియోగ కేంద్రాలను తనిఖీ చేస్తూ అధికారులు వివరాలను పరిశీలించారు.

ఈ తనిఖీల్లో భాగంగా మొత్తం 40 బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్‌ చౌర్యం, అక్రమ కనెక్షన్లు, మీటర్లలో అక్రమ మార్పులు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యుత్‌ను అక్రమంగా వినియోగించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

ఈ తనిఖీల కార్యక్రమంలో విజిలెన్స్‌ ఈఈ విజయకుమారి, నూజివీడు ఈఈ రాజమోహన్‌రావు, విస్సన్నపేట ఏడీఈ వీరబాబు, చాట్రాయి ఏఈ డి.సంజయ్‌తో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మండలంలో ఒకేసారి పెద్ద సంఖ్యలో బృందాలు తనిఖీలు నిర్వహించడంతో విద్యుత్‌ అక్రమ వినియోగదారుల్లో కలకలం నెలకొంది.