చాట్రాయి మండలంలోని అన్ని పాఠశాలల్లో 11266 పాఠ్యపుస్తకాల పంపిణీ ఎంఈవో 2 బ్రహ్మా చారి
ఏలూరు జిల్లా చాట్రాయి మండల పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు మండల విద్యా శాఖాదికారి-2 వి.ఎస్.వి. బ్రహ్మాచారి తెలిపారు, 7 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 7 ప్రాధమిక ఉన్నత పాఠశాలలు, మరియు 47 ప్రాధమిక పాఠశాలలకు మొత్తం 11,266 పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయబడినట్లు ఆయన తెలియజేశారు
ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు సి.గుడిపాడు చనుబండ, మరియు ప్రాధమిక పాఠశాలలు సి.గుడిపాడు, హరిజనవాడ, నరసింహారావు పాలెం, గౌడ బజారు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల పీఎంసీ చైర్మన్లు బీరయ్య, విస్సంపల్లి జ్యోతి, ప్రధానోపాధ్యాయులు రవీంద్రనాథ్, విశ్వభారతి, జి.వెంకటేశ్వరరావు, పిల్లి జయరాజు, ఉపాధ్యాయులు, మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విద్యార్థులు పుస్తకాలు అందుకోవడం ద్వారా కొత్త విద్యా సంవత్సరానికి సక్రమంగా ప్రారంభం చేశారు.