www.ntodaynews.com
చాట్రాయి నుంచి ఆషాఢ సారెతో కనకదుర్గమ్మను దర్శించిన మహిళలు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చాట్రాయి, ఆగస్టు 2: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి గ్రామానికి చెందిన సుమారు 100 మంది మహిళలు ఆషాఢ మాసం సందర్భంగా భక్తిశ్రద్ధలతో ఆషాఢ సారెను విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధికి తీసుకువెళ్లి సమర్పించారు. సంప్రదాయ వస్త్రధారణలో, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, గ్రామ ప్రజల సుఖశాంతి, రాష్ట్ర ప్రజలకు సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో చింతల లక్ష్మీ, తుమ్మల జగన్, మందపాటి నిర్మల, గోలి ప్రమీల, గడ్డం సత్యవతి, పిట్టల రమాదేవి, సంజెపు పద్మజ, గడ్డం మౌని, కుమారి, పద్మ, పుష్పలత, భద్రతో పాటు పలువురు మహిళా భక్తులు పాల్గొన్నారు.