చాట్రాయి పరిధిలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి – ఇద్దరి అరెస్ట్
నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్, నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్ ఆదేశాల మేరకు, 14.06.2026న చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణకు అందిన సమాచారం ఆధారంగా ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామ శివారులో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు.
ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.15,180 నగదు, మూడు మోటార్ సైకిళ్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చాట్రాయి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఎస్సై డి. రామకృష్ణ మాట్లాడుతూ ఆర్థిక నష్టాలకు కారణమయ్యే జూద కార్యకలాపాలను ఎవరైనా ప్రోత్సహించినా లేదా పాల్గొన్నా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదాన్ని ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించబోమని తెలిపారు. అలాగే ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.