చాట్రాయిలో వైభవంగా వైసీపీ నేత ఇంట శుభకార్యాలు
చాట్రాయిలో వైభవంగా వైసీపీ నేత ఇంట శుభకార్యాలు… అతిరథ మహారథుల సందడి!
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి గ్రామానికి చెందిన వైసీపీ నేత సవరం రవీంద్ర నాగ పావని దంపతుల కుటుంబంలో శుభకార్యాలు ఘనంగా నిర్వహించారు. వారి కుమార్తె చరణ్య నూతన వస్త్రాలంకరణ (ఓణీలు) వేడుక, కుమారుడు సాయి సాత్విక్ నూతన వస్త్ర బహూకరణ (పంచెలు) కార్యక్రమాలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి.
ఈ కార్యక్రమాలకు నూజివీడు మాజీ శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ మాజీ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి, మండల వైసీపీ నాయకులు పుచ్చకాయల సుబ్బారెడ్డి, కారంగుల శ్రీనివాసరావు, పుచ్చకాయల అప్పిరెడ్డి, పరసా చెన్నారావు, గడ్డం శ్రీనివాసరెడ్డి, నెల్లూరి రాజేష్, సంకు సత్యనారాయణ, సవరం వెంకట్రావు, నెల్లూరి సతీష్, మిద్దె బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు.
నాయకులు చిన్నారులను ఆశీర్వదించి, వారి భవిష్యత్తు వెలుగొందాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.