www.ntodaynews.com
చౌటుప్పల్ మున్సిపాలిటీ లో గ్రామసభలు విజయవంతముగా ముగిసాయి
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపాలిటీ లో గ్రామసభలు విజయవంతముగా ముగిసాయి
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మార్చి 6 నుండి మొదలైన 99 రోజుల ప్రజా పాలన లో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని 20 వార్డులలో జరిగిన గ్రామ సభలు ప్రశాంతంగా ముగిసాయి. ఇందులో భాగంగా 9 వార్డు సభలో పాల్గొన్నటువంటి చౌటుప్పల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ, 9 వ వార్డులోని సమస్యలను పరిష్కరిస్తూ, మున్సిపాలిటీ లో ఉన్న అన్ని వార్డుల సమస్యలు తమవి గా భావించి పరిష్కరిస్తామని అన్నారు. అలాగే కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ 19 వ వార్డు సభలో మాట్లాడుతూ వార్డు లోని అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని, త్వరలో ఆ సమస్యలన్నింటిని పరిష్కరిస్తానని 19 వ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు.