చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి..
చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. ప్రముఖులు,ప్రజల విజ్ఞప్తి.
పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించడంలో మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (AIIMS) కీలక పాత్ర పోషిస్తోంది. అయితే,చిలకలూరిపేట నియోజకవర్గపరిధిలోని గ్రామీణ ప్రాంత ప్రజలు, వయోవృద్ధులు వైద్యం కోసం ఎయిమ్స్ హాస్పిటల్కు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలోచిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్కు నేరుగా ప్రత్యేక ఆర్టీసీబస్సులను ఏర్పాటు చేయాలని పలువురు ప్రముఖులు మరియు స్థానిక ప్రజలు ప్రభుత్వానికి,ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రయాణికుల ప్రధాన సమస్యలు..
రవాణా ఇబ్బందులు..
చిలకలూరిపేట నుండి నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో..ప్రయాణికులు మొదట గుంటూరు చేరుకుని, అక్కడి నుండి మంగళగిరి వెళ్లి, ఆపై ఎయిమ్స్ హాస్పిటల్కు చేరుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు.
వృద్ధుల వేదన..
చిన్న, పెద్ద ఆపరేషన్ల కోసం వెళ్లే వయోవృద్ధులు మార్గమధ్యంలోబస్సులు మారుస్తూ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల విన్నపం..
నియోజకవర్గంలోని మూడు మండలాల ప్రజలు ఎయిమ్స్లో మెరుగైన వైద్యం సులభంగా పొందాలంటే రవాణా సౌకర్యం మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రజల ప్రధాన డిమాండ్..
చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కనీసం రెండు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడిపించాలని ప్రజలు కోరుతున్నారు.దీనివల్ల నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ పేదలకు రవాణా భారం తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.