BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

చిలకలూరిపేటలో విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్.. 562 కేసుల పరిష్కారం, రూ.1.78 కోట్ల రాజీ

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 06:41 AM
61 వీక్షణలు

చిలకలూరిపేట: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా ముగిసింది. స్థానిక ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కక్షిదారులు పాల్గొని పరస్పర అంగీకారంతో తమ వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకున్నారు.

ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 562 కేసులు పరిష్కారమవగా, రూ.1,78,77,543 విలువైన రాజీ ఒప్పందాలు నమోదైనట్లు న్యాయమూర్తులు వెల్లడించారు.

పరిష్కారమైన కేసుల్లో 390 సమ్మరీ ట్రయల్ కేసులు, 117 క్రిమినల్ కేసులు, 44 సివిల్ కేసులు, 5 గృహ హింస కేసులు, 4 వైవాహిక కేసులు ఉన్నాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు కేసులు ఒకే వేదికపై పరిష్కారం కావడంతో కక్షిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ చైతన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె. నరేంద్ర రెడ్డి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎస్.ఎం. సుభాని పాల్గొని కేసుల పరిష్కార ప్రక్రియను పర్యవేక్షించారు. న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు సమన్వయంతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా లోక్ అదాలత్ విజయవంతానికి సహకరించిన న్యాయవాదులు, పోలీసు శాఖ అధికారులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులందరికీ న్యాయమూర్తులు కృతజ్ఞతలు తెలిపారు.