BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

చిలకలూరిపేటలో విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్.. 562 కేసుల పరిష్కారం, రూ.1.78 కోట్ల రాజీ

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 06:41 AM
14 వీక్షణలు

చిలకలూరిపేట: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా ముగిసింది. స్థానిక ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కక్షిదారులు పాల్గొని పరస్పర అంగీకారంతో తమ వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకున్నారు.

ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 562 కేసులు పరిష్కారమవగా, రూ.1,78,77,543 విలువైన రాజీ ఒప్పందాలు నమోదైనట్లు న్యాయమూర్తులు వెల్లడించారు.

పరిష్కారమైన కేసుల్లో 390 సమ్మరీ ట్రయల్ కేసులు, 117 క్రిమినల్ కేసులు, 44 సివిల్ కేసులు, 5 గృహ హింస కేసులు, 4 వైవాహిక కేసులు ఉన్నాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు కేసులు ఒకే వేదికపై పరిష్కారం కావడంతో కక్షిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ చైతన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె. నరేంద్ర రెడ్డి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎస్.ఎం. సుభాని పాల్గొని కేసుల పరిష్కార ప్రక్రియను పర్యవేక్షించారు. న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు సమన్వయంతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా లోక్ అదాలత్ విజయవంతానికి సహకరించిన న్యాయవాదులు, పోలీసు శాఖ అధికారులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులందరికీ న్యాయమూర్తులు కృతజ్ఞతలు తెలిపారు.