BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

చింతలపూడి ఆర్టీసీ కొత్త బస్టాండ్ ఆధునికీకరణ పనుల ప్రారంభోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jun, 2026 - 05:53 AM
14 వీక్షణలు

చింతలపూడి మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

30 లక్షల వ్యయంతో చింతలపూడి ఆర్టీసీ కొత్త బస్టాండ్‌లో పూర్తయిన ఆధునికీకరణ పనుల ప్రారంభోత్సవాన్ని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఘనంగా ప్రారంభించారు.

చింతలపూడి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్టాండ్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చేపట్టిన ఆధునికీకరణ పనులు పూర్తికావడంతో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. బస్టాండ్‌లో కల్పించిన సౌకర్యాలను ఎమ్మెల్యే పరిశీలించి, ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందేలా అధికారులు మరింత శ్రద్ధ చూపాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రతి పనిని దశలవారీగా పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి (DPTO), డిపో మేనేజర్, ఆర్టీసీ అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.