www.ntodaynews.com
చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు – మద్యం స్వాధీనం, కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ & ఎక్సైజ్, ఏలూరు శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ & ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు కె.వి.యన్. ప్రభు కుమార్, DPEO ఏలూరు జిల్లా ఆవులయ్య ఆదేశాల మేరకు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు, సిబ్బంది కలిసి ఎక్సైజ్ నేరాలపై దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో రాఘవాపురం గ్రామానికి చెందిన పర్స నరసింహారావు వద్ద నుండి 07 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేశారు.
అలాగే కామవరపుకోట మండలంలోని పలు మద్యం దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సురక్ష యాప్ ద్వారా మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని దుకాణదారులకు సూచనలు జారీ చేశారు.
ఈ దాడుల్లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్ఐలు అబ్దుల్ ఖలీల్, జె. జగ్గారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు అని ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు.