BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 08:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి మండలానికి గర్వకారణం.. ఉత్తమ ఉపాధ్యాయునిగా ప్రభాకర్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Sep, 2026 - 08:15 PM
8 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

66 మార్కులతో జిల్లా స్థాయిలో రెండో స్థానం.. మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక

చింతలపూడి: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు బోధనలో ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను గుర్తించి ప్రోత్సహించే క్రమంలో చింతలపూడి మండలానికి చెందిన యు. ప్రభాకర్ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. సుప్రియన్‌పేటకు చెందిన ప్రభాకర్ ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన విద్యాశాఖ మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేసింది.

జిల్లా వ్యాప్తంగా మొత్తం 33 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందించేందుకు ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. పాఠశాల సహాయకులు, మాధ్యమిక శ్రేణి ఉపాధ్యాయుల విభాగాల్లో అత్యధికంగా 70 మార్కులు సాధించిన వారు మొదటి స్థానంలో నిలిచారు. ఈ పోటీలో చింతలపూడి మండలానికి చెందిన యు. ప్రభాకర్ 66 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక కావడంతో ప్రభాకర్‌కు విద్యాశాఖ అధికారులు, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు. బోధన పట్ల నిబద్ధత, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ, పాఠశాల అభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనమని పలువురు పేర్కొన్నారు. చింతలపూడి మండలానికి చెందిన ఉపాధ్యాయుడు జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం మండలానికి గర్వకారణమని అభినందనలు తెలిపారు.