www.ntodaynews.com
చింతలపూడిలో 3 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన సాధారణ వాహనాల తనిఖీలో 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చింతలపూడి నుంచి ఫాతిమాపురం వెళ్లే మార్గంలోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఈరోజు నిర్వహించిన తనిఖీల్లో బైక్పై గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు గుర్తించారు.
వారి వద్ద నుంచి సుమారు 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.