www.ntodaynews.com
చిన్న మల్లెల గ్రామం నుంచి ద్వారకాతిరుమలకు కాలినడక యాత్ర
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వేంసూరు మండలం చిన్న మల్లెల గ్రామానికి చెందిన 30 మంది భక్తులు ద్వారకాతిరుమల స్వామి దర్శనం కోసం కాలినడకన ప్రయాణం ప్రారంభించారు.
గత సంవత్సరం అంతా స్వామి అనుగ్రహంతో కాపాడబడ్డామని, అందుకు కృతజ్ఞతగా దర్శనం చేసుకోవడానికి వెళుతున్నామని భక్తులు విలేకరులకు తెలిపారు. గోవింద నామస్మరణ చేస్తూ భక్తి భావంతో యాత్ర కొనసాగుతున్నదని చెప్పారు.
స్వామి ఆశీస్సులు పొందేందుకు ఈ పాదయాత్రను భక్తులు శ్రద్ధగా కొనసాగిస్తున్నారు.