చిన్నంపేటలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి
చిన్నంపేటలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో 199వ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహించబడింది.
సిపిఐ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, కొమ్ము ఆనందం మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల ఆశాజ్యోతి అయ్యారని అన్నారు. ఆయన కుల మత భేదాలకు అతీతంగా పనిచేసి, అనేక సామాజిక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారని తెలిపారు.
భారతదేశంలో విద్య లేని వర్గాలకు చెందిన ప్రజలు, ఆ సమాజంలోని అనేక చట్టాలు, ఆచారాలు మరియు మూలాలు కేవలం అనర్ధమైనవి అన్న సంగతి మనం గుర్తించాలని,మహాత్మా పూలే, స్త్రీలకు విద్య ఇచ్చి, వారి సామాజిక స్థితిని పెంచడానికి మార్గదర్శకులు అయ్యారని అన్నారు
ఈ కార్యక్రమంలో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ పాస్టర్ రమేషు, పుష్పావతి, సువర్ణ, ఎం. జాను, ఎం. ఏసు, గంగులు, ఇశ్రాయేలు తదితరులు పాల్గొన్నారు.