చిట్యాల లో వీధి విక్రయదారుల కమిటీ దరఖాస్తుల ఆహ్వానం
చిట్యాల లో వీధి విక్రయదారుల కమిటీ దరఖాస్తుల ఆహ్వానం : మున్సిపల్ కమిషనర్ గురు లింగం NTODAY NEWS చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల పురపాలక సంఘం పరిధిలో పట్టణ వీధి విక్రయదారుల కమిటీ ని ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ కమిషనర్ గురు లింగం కసరత్తు ప్రారంభించారు. వీధి విక్రయదారుల చట్టం 2014 మరియు 'రూల్స్ 2020 నిబంధనల ప్రకారం మొత్తం 11 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా కమిటీలోని 5 మంది అనధికార సభ్యుల ) ఎంపిక కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ గురు లింగం ఒక ప్రకటనలో తెలిపారు.మొత్తం 11 మంది సభ్యులలో అధికార సభ్యులను నలుగురిని మున్సిపల్ కమిషనర్ నామినేట్ చేస్తారు. ఇందులో జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి ఒకరిని నామినేట్ చేస్తారు. మున్సిపాలిటీ లో ఎన్నికైన కౌన్సిలర్ల నుంచి ఒకరిని కౌన్సిల్ తీర్మానం ద్వారా ఎంపిక చేస్తారు. వివిధ వ్యాపారాలు చేసుకునే వీధి విక్రయదారుల నుంచి 4 సభ్యులు (రొటేషన్ పద్ధతిపై) స్వచ్ఛంద సంస్థలు లేదా సమాజ ఆధారిత సంఘాల నుంచి ఒకరిని ఎన్నికలు చేస్తారు ఈ కమిటీలో సభ్యత్వం కోరుకునే అర్హులైన వ్యక్తులు తమ దరఖాస్తులను సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో కలిపి మే 18, 2026 లోపు మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని కమిషనర్ గురులింగం సూచించారు.