చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం
చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం
చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న కార్యదర్శి ఆర్. జానయ్యకు వీడ్కోలు, మరియు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జె. సత్యనారాయణకు స్వాగత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి నర్ర వినోద మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి చిట్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పందిరి గీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జానయ్య చిట్యాలలో అందించిన సేవలను కొనియాడారు. నూతన కార్యదర్శి సత్యనారాయణ రైతు సంక్షేమం, మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన కార్యదర్శి మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ, పారదర్శకంగా మార్కెట్ నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు, కార్యాలయ సిబ్బంది, హమాలీలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని, అధికారులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు.