BREAKING
తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ
Date of Publish : 19 March 2026, 04:57 am
Posted by : కూనురు మధు

వేసవికి ముందే ప్రారంభమైన నీటి కష్టాలు

తెలంగాణ
19 Mar, 2026 - 04:57 AM
263 వీక్షణలు

చిట్యాల ప్రజల దాహార్తి..  వేసవికి ముందే ప్రారంభమైన నీటి కష్టాలు 

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో వేసవికాలం ప్రారంభం కాకముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా మున్సిపాలిటీలో నీటి సరఫరా తీవ్రంగా అంతరాయం కలగడంతో ప్రజలు బిందెడు నీటి కోసం అల్లాడుతున్నారు. ప్రజల కష్టాలను గుర్తించిన స్థానిక కౌన్సిలర్లు తమవంతు బాధ్యతగా రంగంలోకి దిగారు.​ మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా వార్డులలో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని, 8వ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్, 11వ వార్డు కౌన్సిలర్ బొబ్బలి సందీప రామ్ రెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్ షబానా అజీమ్ తమ వార్డులలోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే స్పందించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు సొంత చొరవతో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయిస్తున్నారు. తమ వార్డుల్లో నీటి సమస్యను పరిష్కరించేందుకు వారు చేస్తున్న కృషిని స్థానికులు అభినందిస్తున్నారు. ప్రస్తుతం కౌన్సిలర్ల చొరవతో తాత్కాలికంగా నీటి అవసరాలు తీరుతున్నప్పటికీ, మున్సిపాలిటీ అంతటా ఇదే పరిస్థితి కొనసాగుతోందని ప్రజలు వాపోతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగితే పరిస్థితి ఇంకా దారుణంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు మేల్కొనాలని, చిట్యాల పట్టణ అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాలో ఉన్న లోపాలను సరిదిద్ది, వేసవికాలం మొత్తానికి నీటి కష్టాలు రాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.