BREAKING
నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్
www.ntodaynews.com

వేసవికి ముందే ప్రారంభమైన నీటి కష్టాలు

తెలంగాణ
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
19 Mar, 2026 - 04:57 AM
194 వీక్షణలు

చిట్యాల ప్రజల దాహార్తి..  వేసవికి ముందే ప్రారంభమైన నీటి కష్టాలు 

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో వేసవికాలం ప్రారంభం కాకముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా మున్సిపాలిటీలో నీటి సరఫరా తీవ్రంగా అంతరాయం కలగడంతో ప్రజలు బిందెడు నీటి కోసం అల్లాడుతున్నారు. ప్రజల కష్టాలను గుర్తించిన స్థానిక కౌన్సిలర్లు తమవంతు బాధ్యతగా రంగంలోకి దిగారు.​ మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా వార్డులలో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని, 8వ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్, 11వ వార్డు కౌన్సిలర్ బొబ్బలి సందీప రామ్ రెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్ షబానా అజీమ్ తమ వార్డులలోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే స్పందించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు సొంత చొరవతో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయిస్తున్నారు. తమ వార్డుల్లో నీటి సమస్యను పరిష్కరించేందుకు వారు చేస్తున్న కృషిని స్థానికులు అభినందిస్తున్నారు. ప్రస్తుతం కౌన్సిలర్ల చొరవతో తాత్కాలికంగా నీటి అవసరాలు తీరుతున్నప్పటికీ, మున్సిపాలిటీ అంతటా ఇదే పరిస్థితి కొనసాగుతోందని ప్రజలు వాపోతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగితే పరిస్థితి ఇంకా దారుణంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు మేల్కొనాలని, చిట్యాల పట్టణ అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాలో ఉన్న లోపాలను సరిదిద్ది, వేసవికాలం మొత్తానికి నీటి కష్టాలు రాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.