చిట్యాలలో తైక్వాండో బెల్టులు ప్రధానం
చిట్యాలలో తైక్వాండో బెల్టులు ప్రధానం
క్రీడల్లో ప్రతిభను పెంపొందించుకోవడంతో పాటు క్రమశిక్షణతో సాధన చేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తైక్వాండో ముఖ్య పరీక్షకుడు సుధాకర్ అన్నారు. చిట్యాల జెడ్పీహెచ్ఎస్లో ఆదివారం నల్లగొండ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో తైక్వాండో కలర్ బెల్ట్ పరీక్ష నిర్వహించారు. చిట్యాల, రామన్నపేట, నార్కట్పల్లి మండలాలకు చెందిన 50 మంది క్రీడాకారులు పరీక్షకు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు.
పరీక్షలో ఎల్లో విభాగంలో 17 మంది, ఎల్లో వన్లో 6 మంది, గ్రీన్లో 9 మంది, గ్రీన్ వన్లో 4 మంది, బ్లూలో 5 మంది, బ్లూ వన్లో 5 మంది, రెడ్లో 2 మంది, రెడ్ వన్లో 2 మంది క్రీడాకారులు బెల్టులను సాధించారు. అనంతరం సుధాకర్ క్రీడాకారులకు బెల్టులను ప్రదానం చేశారు. వచ్చే నెలలో జరగనున్న ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) పోటీల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే టోర్నమెంట్లను సద్వినియోగం చేసుకోవాలని, వాటికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.
క్రీడాకారులు క్రమం తప్పకుండా శిక్షణ తరగతులకు హాజరవుతూ తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని తెలిపారు., మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించి తల్లిదండ్రులకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ
కార్యక్రమంలో తైక్వాండో కోచ్లు పి. పనీంద్ర కుమార్, పి. మల్లేశ్వరి పాల్గొన్నారు.