చిట్యాలలో ఉచిత యోగ శిక్షణా శిబిరం
చిట్యాలలో ఉచిత యోగ శిక్షణా శిబిరం
నల్గొండ జిల్లా చిట్యాల లో ఆగస్టు 6వ తేదీ నుండి సంకల్ప క్రియ యోగ ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించబడునని సంకల్ప క్రియా యోగ గురువు శ్రీ రఘు గురూజీ తెలిపారు. చిట్యాల లో ఉచిత యోగ శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన ప్రచార కరపత్రాలను బుధవారం గురూజీ ఆవిష్కరించారు. శరీరం మనసు ఒక్కటయ్యేందుకు యోగ సాధన చేయాలని అన్నారు. యోగాతో పాటు ఆరోగ్యం మానసిక ప్రశాంతతకు యోగా చేయడం ఎంతో ఉత్తమమన్నారు. యోగాలో భాగంగా ధ్యానం చేసినట్లయితే మేధస్సును ఏకాగ్రతను పెంచుతుందన్నారు యోగశిక్షణలో శరీరంలో అనారోగ్య సమస్యలను దూరం చేసేలా సునాయాసమైన ఆసనాలను నేర్పిస్తామని చెప్పారు. ఆగస్టు 6వ తేది నుండి 14వ తేది వరకు జరిగే ఉచిత యోగ శిక్షణకు ప్రతి ఒక్కరు హాజరై ఆరోగ్యావంతులుగా ఉండాలని, ఆరోగ్యం ను మెరుగుపరచుకోవాలన్నారు. కార్యక్రమం లో శిక్షకులు, సాధకులు పాల్గొన్నారు.