www.ntodaynews.com
చనుబండ పిఏసియస్ సభ్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్
చనుబండ పిఏసియస్ సభ్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నాయని చనుబండ పీఏసీఎస్ ఛైర్పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు
ఇటీవల కృష్ణారావుపాలెం గ్రామానికి చెందిన చనుబండ పీఏసీఎస్ సభ్యుడు పల్లపు మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం సహకార సంఘం తరఫున మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10 వేల నగదు సహాయాన్ని మల్లయ్య భార్య కృష్ణకుమారికి ఛైర్పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కృష్ణారావుపాలెం మాజీ సర్పంచ్ చిమటబోయిన పుల్లారావు, సొసైటీ సీఈఓ అనిశెట్టి వెంకటేశ్వరరావు, ధర్మరాజుల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.