BREAKING
తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు తమిళనాడు సీఎం విజయ్‌తో కమల్ హాసన్ భేటీ.. అభివృద్ధి పై చర్చ గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం : ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన లారీ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన పెంపుదలపై ప్రత్యేక దృష్టి ప్రైవేట్ ఆసుపత్రి బిల్లు కట్టలేదని డెడ్ బాడీని ఆపినా.. డిశ్చార్జ్ నిరాకరించినా.. అది నేరమే! రైతుల పంటలకు మద్దతు ధరల పెంపు మోసపూరితం స్టేషన్‌కే ఆలయ కళ… చిన్న తిరుపతిని తలపిస్తున్న ఏలూరు రైల్వే జంక్షన్ చనుబండలో గృహ నిర్మాణ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన చనుబండ పిఏసియస్ సభ్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం రైతులకు ఉపయోగకరంగా APAIMS ఫార్మర్ యాప్ తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు తమిళనాడు సీఎం విజయ్‌తో కమల్ హాసన్ భేటీ.. అభివృద్ధి పై చర్చ గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం : ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన లారీ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన పెంపుదలపై ప్రత్యేక దృష్టి ప్రైవేట్ ఆసుపత్రి బిల్లు కట్టలేదని డెడ్ బాడీని ఆపినా.. డిశ్చార్జ్ నిరాకరించినా.. అది నేరమే! రైతుల పంటలకు మద్దతు ధరల పెంపు మోసపూరితం స్టేషన్‌కే ఆలయ కళ… చిన్న తిరుపతిని తలపిస్తున్న ఏలూరు రైల్వే జంక్షన్ చనుబండలో గృహ నిర్మాణ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన చనుబండ పిఏసియస్ సభ్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం రైతులకు ఉపయోగకరంగా APAIMS ఫార్మర్ యాప్
www.ntodaynews.com

చనుబండలో గృహ నిర్మాణ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 04:47 PM
27 వీక్షణలు

చనుబండలో గృహ నిర్మాణ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఏలూరు కార్యనిర్వహణ అధికారి, నూజివీడు మండల స్థాయి ఇంజనీరింగ్ సిబ్బంది, వర్క్ ఇన్స్పెక్టర్‌లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి నిర్మాణ పనుల పురోగతి, సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. గృహ నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు, అవసరాలపై లబ్ధిదారుల అభిప్రాయాలను తెలుసుకుని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో చనుబండ పిఎసిఎస్ చైర్పర్సన్, నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రైతు విభాగం అధ్యక్షులు మోరంపూడి శ్రీనివాసరావు, భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు నెక్కళ్లపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.