చనుబండలో గృహ నిర్మాణ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన
చనుబండలో గృహ నిర్మాణ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఏలూరు కార్యనిర్వహణ అధికారి, నూజివీడు మండల స్థాయి ఇంజనీరింగ్ సిబ్బంది, వర్క్ ఇన్స్పెక్టర్లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి నిర్మాణ పనుల పురోగతి, సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. గృహ నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు, అవసరాలపై లబ్ధిదారుల అభిప్రాయాలను తెలుసుకుని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో చనుబండ పిఎసిఎస్ చైర్పర్సన్, నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రైతు విభాగం అధ్యక్షులు మోరంపూడి శ్రీనివాసరావు, భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు నెక్కళ్లపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.