BREAKING
ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

చనుబండలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంలో బిజెపి BLO లు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 10:18 AM
14 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ సమగ్ర జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు అసెంబ్లీ చాట్రాయి మండలంలోని 51 పోలింగ్ బూత్ పరిధిలో ప్రభుత్వ BLOలు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

చనుబండ గ్రామపంచాయతీ బూత్ నంబర్ 3, 4 పరిధిలో ప్రభుత్వ BLOలు కోటేశ్వరరావు, మురళీమోహన్ ఆధ్వర్యంలో SIR కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బిజెపి BLO-2లు బుర్రి సుమలత, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీకర్ బుర్రి మాట్లాడుతూ, సమగ్ర ఓటర్ జాబితా ద్వారా అర్హులైన కొత్త ఓటర్ల పేర్లు నమోదు కావడం, మరణించిన వారి పేర్లు తొలగించడం, ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలు సవరించడం, అలాగే ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్న ఓటు నమోదులను తొలగించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియతో ఖచ్చితమైన ఓటర్ జాబితా తయారవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగి మంచి ప్రభుత్వం ఏర్పడేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. BLOలు ఇంటింటికి వచ్చినప్పుడు సరైన వివరాలు అందించి, తమ పేరు ఓటర్ జాబితాలో ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకోవాలని, తప్పులు ఉంటే సవరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అలాగే అన్ని రాజకీయ పార్టీల పోలింగ్ బూత్ స్థాయి ప్రతినిధులు (BLO-2) సహా సంబంధిత అధికారులు నిబద్ధతతో, అవినీతి రహితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పరస శ్రీనివాసరావు (టీడీపీ), తేనేటి వేణు (టీడీపీ), తాళ్లూరి గోపి (వైసీపీ) తదితరులు, అలాగే పలువురు ఓటర్లు పాల్గొన్నారు.