BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

చనుబండలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంలో బిజెపి BLO లు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 10:18 AM
78 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ సమగ్ర జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు అసెంబ్లీ చాట్రాయి మండలంలోని 51 పోలింగ్ బూత్ పరిధిలో ప్రభుత్వ BLOలు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

చనుబండ గ్రామపంచాయతీ బూత్ నంబర్ 3, 4 పరిధిలో ప్రభుత్వ BLOలు కోటేశ్వరరావు, మురళీమోహన్ ఆధ్వర్యంలో SIR కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బిజెపి BLO-2లు బుర్రి సుమలత, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీకర్ బుర్రి మాట్లాడుతూ, సమగ్ర ఓటర్ జాబితా ద్వారా అర్హులైన కొత్త ఓటర్ల పేర్లు నమోదు కావడం, మరణించిన వారి పేర్లు తొలగించడం, ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలు సవరించడం, అలాగే ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్న ఓటు నమోదులను తొలగించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియతో ఖచ్చితమైన ఓటర్ జాబితా తయారవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగి మంచి ప్రభుత్వం ఏర్పడేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. BLOలు ఇంటింటికి వచ్చినప్పుడు సరైన వివరాలు అందించి, తమ పేరు ఓటర్ జాబితాలో ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకోవాలని, తప్పులు ఉంటే సవరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అలాగే అన్ని రాజకీయ పార్టీల పోలింగ్ బూత్ స్థాయి ప్రతినిధులు (BLO-2) సహా సంబంధిత అధికారులు నిబద్ధతతో, అవినీతి రహితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పరస శ్రీనివాసరావు (టీడీపీ), తేనేటి వేణు (టీడీపీ), తాళ్లూరి గోపి (వైసీపీ) తదితరులు, అలాగే పలువురు ఓటర్లు పాల్గొన్నారు.