www.ntodaynews.com
కూటమి ప్రభుత్వంలో క్రైస్తవులకు పెద్ద పీట
తెలంగాణ
కూటమి ప్రభుత్వంలో క్రైస్తవులకు పెద్ద పీట: స్వామి దాసు
NTODAY NEWS: తూర్పుగోదావరి జిల్లా,
గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల గ్రామంలో సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు పెద్ద పీట వేసిందని తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటే స్వామి దాసు అన్నారు ఏడు నెలల గౌరవ వేతనం ఒక్కొక్కరికి రూ 35,000 వేల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారన్నారు విదేశీ విద్య ద్వారా క్రైస్తవ విద్యార్థులకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు కూటమి ప్రభుత్వం ఇస్తున్నారని అన్నారు క్రైస్తవుల జెరూసలేం యాత్రకు 60,000 వేల రూపాయలు ఇస్తున్నారని అన్నారు వ్యాపారం చేసుకోవడానికి లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారని, పాఠశాలలకు వెళ్లే క్రైస్తవ విద్యార్థులకు 16 కోట్ల 59 లక్షలు ఇప్పటివరకు వరకు విద్యార్థులకు ఇచ్చారన్నారు తామంతా కూటమి ప్రభుత్వంలో మేలును పొందుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నక్క ఆనంద్ కుమార్, పెనుమాక రాజ్ కుమార్ , ఈడూరి డేవిడ్ రాజు, కె. రత్నరాజు, నల్ల చిన్నబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube