www.ntodaynews.com
సీఎం సహాయనిధి పేదలకు వరం : ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
సీఎం సహాయనిధి పేదలకు వరం : ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి
వేల్పనూరు : పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక వరం అని శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. ఆదివారం వేల్పనూరు నందు వివిధ మండలాలకు చెందిన 63 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 48 లక్షల విలువగల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్కరికి సాయం మంజూరు అవుతుందని అన్నారు. గతంలోనూ రికార్డు స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్ ను ప్రజలకు అందించామని.. ఇప్పుడు కూడా నెలలో రెండు పర్యాయాలు పేద ప్రజల వైద్య చికిత్సలకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సహకారంలో లక్షలలో సహాయం అందిస్తున్నామన్నారు.