ఉపాధి హామీ నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ దీక్ష
NTODAY NEWS: ఏలూరు జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్
బీజేపీపై విమర్శలు గుప్పించిన ఆలపాటి నరసింహమూర్తి
ఏలూరు నగరంలోని వసంత మహల్ సెంటర్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం సమీపంలో ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు.
ఈ దీక్షకు సీపీఐ, సీపీఎం వామపక్ష పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ఉపాధి హామీ పనుల నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం అమానుష చర్య అని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తుందని తెలిపారు. ఉపాధి హామీ పథకానికి తిరిగి మహాత్మా గాంధీ పేరును పెట్టే వరకు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య, సీపీఎం నాయకులు రవి, రైతు సంఘం నాయకుడు కె. శ్రీనివాస్, దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ఆలపాటి నరసింహమూర్తి, ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్ రావు, ఏలూరు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుబ్రమణ్య శర్మతో పాటు కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube