www.ntodaynews.com
శ్రీ తలుపులమ్మతల్లి దేవస్థాన హుండీ లెక్కింపు
తెలంగాణ
శ్రీ తలుపులమ్మతల్లి దేవస్థాన హుండీ లెక్కింపు
NTODAY NEWS:ప్రవీణ్ తుని మండల రిపోర్టర్, కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా లోవ కొత్తూరు గ్రామం తలుపులమ్మ దేవస్థానం ఓం శ్రీ మత్రేయ నమః శుక్రవారం అనగా తేది .19-12-2025న శ్రీతలుపులమ్మ అమ్మవారి దేవస్థానం, లోవనకు సంభందించిన హుండీలు 71 రోజులకు తెరచి లెక్కించుట జరిగినది. సదరు హుండీలు ద్వారా నోట్లు రూపేణా రూ.45,76,941/-లు మరియు చిల్లర రూపేణా రూ. 3,81,514/-లు వెరసి మొత్తం రూ. 49,58,455/-లు
, బంగారు రూపేణా గ్రా.59 .20 మి .గ్రా , వెండి చిల్లర రూపేణా వస్తువులు కేజీ 1 156 గ్రాములు వచ్చియున్నదని దేవస్థాన ఉప కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ P.విశ్వనాధరాజు తెలియజేశారు.
సదరు కార్యక్రమము నందు M.మంజుల దేవి, సహాయ కార్యనిర్వహణాధికారి, శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, అన్నవరం పర్యవేక్షణ సమక్షంలో ఈ దేవస్థాన సిబ్బంది, శ్రీవారి సేవకులు, నాయి బ్రాహ్మణులు, మరియు శ్రీ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు సిబ్బంది పాల్గొనియున్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube