డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా కబడ్డీ పోటీలు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా కబడ్డీ పోటీలు
12వ తారీఖున సాయంత్రం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కబడ్డీ పోటీలు రాజమండ్రిలో ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి కబడ్డీ ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఏలూరు జిల్లా నుండి కూడా కబడ్డీ ఆట పట్ల ఆసక్తి ఉన్న కాలేజీ విద్యార్థులు మరియు ఇతరులు ఈ పోటీలలో పాల్గొనడానికి అవకాశం పొందుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు సురేష్ మరియు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. గోదావరి జోన్ రాజమండ్రి విటి కాలేజీలో జరుగుతున్న ఈ పోటీలకు గోదావరి జోన్ ఐదు జిల్లాల ఎస్సీ మోర్చా అధ్యక్షులు బాధ్యత వహిస్తున్నారు. పోటీల కార్యాచరణను క్రమబద్ధీకరించేందుకు ఈ రోజు అంబేద్కర్ ఫోటోతో ఉన్న వాల్ పోస్టర్ను రాజమండ్రి జిల్లా బిజెపి ఆఫీస్లో ఆవిష్కరించారు. ఏలూరు జిల్లాలోని నూజివీడు, కైకలూరు, ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం అసెంబ్లీల నుండి కాలేజీ విద్యార్థులు మరియు ఇతరులు కూడా ఈ పోటీలలో పాల్గొనాలని ప్రోత్సహిస్తున్నారు. పోటీలో విజయం సాధించిన వారికి మొదటి బహుమతి ₹50,000, రెండవ బహుమతి ₹30,000, మూడవ బహుమతి ₹20,000, నాల్గవ బహుమతి ₹10,000 నగదు బహుమతులు ఇవ్వబడతాయి. పోటీలో పాల్గొనాలనుకున్న వారు 9912449030 నెంబర్కు ఫోన్ చేసి తమ టీమ్ వివరాలను నమోదు చేసుకోవాలని ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి తెలిపారు.