BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 10 April 2026, 06:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా కబడ్డీ పోటీలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Apr, 2026 - 06:53 PM
178 వీక్షణలు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా కబడ్డీ పోటీలు

12వ తారీఖున సాయంత్రం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కబడ్డీ పోటీలు రాజమండ్రిలో ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి కబడ్డీ ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఏలూరు జిల్లా నుండి కూడా కబడ్డీ ఆట పట్ల ఆసక్తి ఉన్న కాలేజీ విద్యార్థులు మరియు ఇతరులు ఈ పోటీలలో పాల్గొనడానికి అవకాశం పొందుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు సురేష్ మరియు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. గోదావరి జోన్ రాజమండ్రి విటి కాలేజీలో జరుగుతున్న ఈ పోటీలకు గోదావరి జోన్ ఐదు జిల్లాల ఎస్సీ మోర్చా అధ్యక్షులు బాధ్యత వహిస్తున్నారు. పోటీల కార్యాచరణను క్రమబద్ధీకరించేందుకు ఈ రోజు అంబేద్కర్ ఫోటోతో ఉన్న వాల్ పోస్టర్‌ను రాజమండ్రి జిల్లా బిజెపి ఆఫీస్‌లో ఆవిష్కరించారు. ఏలూరు జిల్లాలోని నూజివీడు, కైకలూరు, ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం అసెంబ్లీల నుండి కాలేజీ విద్యార్థులు మరియు ఇతరులు కూడా ఈ పోటీలలో పాల్గొనాలని ప్రోత్సహిస్తున్నారు. పోటీలో విజయం సాధించిన వారికి మొదటి బహుమతి ₹50,000, రెండవ బహుమతి ₹30,000, మూడవ బహుమతి ₹20,000, నాల్గవ బహుమతి ₹10,000 నగదు బహుమతులు ఇవ్వబడతాయి. పోటీలో పాల్గొనాలనుకున్న వారు 9912449030 నెంబర్‌కు ఫోన్ చేసి తమ టీమ్ వివరాలను నమోదు చేసుకోవాలని ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి తెలిపారు.