BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా కబడ్డీ పోటీలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Apr, 2026 - 06:53 PM
67 వీక్షణలు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా కబడ్డీ పోటీలు

12వ తారీఖున సాయంత్రం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కబడ్డీ పోటీలు రాజమండ్రిలో ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి కబడ్డీ ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఏలూరు జిల్లా నుండి కూడా కబడ్డీ ఆట పట్ల ఆసక్తి ఉన్న కాలేజీ విద్యార్థులు మరియు ఇతరులు ఈ పోటీలలో పాల్గొనడానికి అవకాశం పొందుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు సురేష్ మరియు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. గోదావరి జోన్ రాజమండ్రి విటి కాలేజీలో జరుగుతున్న ఈ పోటీలకు గోదావరి జోన్ ఐదు జిల్లాల ఎస్సీ మోర్చా అధ్యక్షులు బాధ్యత వహిస్తున్నారు. పోటీల కార్యాచరణను క్రమబద్ధీకరించేందుకు ఈ రోజు అంబేద్కర్ ఫోటోతో ఉన్న వాల్ పోస్టర్‌ను రాజమండ్రి జిల్లా బిజెపి ఆఫీస్‌లో ఆవిష్కరించారు. ఏలూరు జిల్లాలోని నూజివీడు, కైకలూరు, ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం అసెంబ్లీల నుండి కాలేజీ విద్యార్థులు మరియు ఇతరులు కూడా ఈ పోటీలలో పాల్గొనాలని ప్రోత్సహిస్తున్నారు. పోటీలో విజయం సాధించిన వారికి మొదటి బహుమతి ₹50,000, రెండవ బహుమతి ₹30,000, మూడవ బహుమతి ₹20,000, నాల్గవ బహుమతి ₹10,000 నగదు బహుమతులు ఇవ్వబడతాయి. పోటీలో పాల్గొనాలనుకున్న వారు 9912449030 నెంబర్‌కు ఫోన్ చేసి తమ టీమ్ వివరాలను నమోదు చేసుకోవాలని ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి తెలిపారు.