BREAKING
నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
www.ntodaynews.com

డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ మాయాజాలం

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
02 Apr, 2026 - 04:23 PM
93 వీక్షణలు

డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ మాయాజాలం: డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి

​• పోలీసులెవరూ నేరుగా వీడియో కాల్స్ చేయరు.. అప్రమత్తతే రక్షణ

• సంగారెడ్డిలో సీనియర్ సిటిజన్లకు సైబర్ మోసాలపై అవగాహన

​సంగారెడ్డి (సురక్ష ప్రతినిధి), ఏప్రిల్ 02:

ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ప్రధాన సమస్య అని, వీటి బారి నుండి తప్పించుకోవాలంటే కేవలం అవగాహన మాత్రమే మార్గమని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

​డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసపోకండి

​నేరగాళ్లు పోలీసు అధికారుల పేరిట నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని డీఎస్పీ తెలిపారు. "చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు. ఏ పోలీసు అధికారి కూడా దర్యాప్తు కోసం నేరుగా వీడియో కాల్స్ చేయరు. ఎవరైనా అధికారి అని చెప్పి బెదిరిస్తే నమ్మవద్దు" అని ఆయన స్పష్టం చేశారు.

​నేరగాళ్లు వాడే వివిధ పద్ధతులు:

​పెట్టుబడి మోసాలు: తక్కువ డబ్బుతో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి మల్టీ లెవల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్‌కు పాల్పడతారు.

​ఆర్.టి.ఎ చలానా స్కామ్: మీ వాహనంపై చలానా ఉందని, దాన్ని చెల్లించడానికి ఏపీకే (APK) ఫైల్ పంపిస్తారు. ఆ ఫైల్ ఓపెన్ చేయగానే మీ ఫోన్ సమాచారం నేరగాళ్ల చేతికి వెళ్తుంది.

​కస్టమర్ కేర్ మోసాలు: గూగుల్‌లో కస్టమర్ కేర్ నెంబర్ల కోసం వెతికేటప్పుడు తప్పుడు నెంబర్ల బారిన పడి ఆన్లైన్ బుకింగ్స్ పేరుతో మోసపోవద్దు.

​ఏఐ (AI) ముప్పు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గొంతును లేదా రూపాన్ని మార్చి (Deepfakes) మోసం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.

​గోల్డెన్ అవర్ - 1930

​సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి 48 గంటల్లోపు (గోల్డెన్ అవర్) 1930 నెంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని డీఎస్పీ సూచించారు. అలా చేస్తే పోగొట్టుకున్న డబ్బును వెనక్కి రప్పించే అవకాశం ఉంటుందన్నారు.

​ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఆనంద్ కుమార్, చంద్ర ప్రభాకర్, విజయరావు మరియు సైబర్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.

​జిల్లా పోలీస్ యంత్రాంగం, సంగారెడ్డి జిల్లా