www.ntodaynews.com
ఆస్తి తీసుకుని.. తల్లిని గెంటేసిన కుమారుడు
తెలంగాణ
/
మంచిర్యాల
/
దండేపల్లి
దండపల్లి:ఆస్తి తీసుకుని.. తల్లిని గెంటేసిన కుమారుడు
దండపల్లి పట్టణంలో ఆస్తి కోసం కన్నతల్లిని రోడ్డు పాలు చేసిన అమానుష ఘటన వెలుగుచూసింది. గడ్డం వరమ్మ అనే వృద్ధురాలికి ముగ్గురు కుమారుల సంతానం కాగా, రెండో కుమారుడు మరణించడంతో, చిన్న కుమారుడైన శ్రీనివాస్ ఆమె బాధ్యత తీసుకుంటానని నమ్మబలికాడు. ఈ క్రమంలో తల్లి పోషణ నిమిత్తం కేటాయించిన 9 గుంటల భూమి, బంగారం, మరియు 1.90 లక్షల నగదును తన పేరున తీసుకున్న శ్రీనివాస్, ఆస్తి చేతికి రాగానే అసలు స్వరూపం బయటపెట్టి ఆమెను ఇంటి నుండి గెంటేసాడు. తనను మోసం చేసి దిక్కులేని దానిని చేసిన కుమారుడి తీరుపై బాధితురాలు కన్నీరుమున్నీరవుతూ, తనకు న్యాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటోంది