BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

దోమల బెడదపై సిపిఎం ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Mar, 2026 - 05:16 PM
40 వీక్షణలు

దోమల బెడదపై సిపిఎం ఆందోళన – వెంటనే చర్యలు తీసుకోవాలని వినతి

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో రోజురోజుకూ పెరుగుతున్న దోమల సమస్యపై సిపిఎం మండల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. దోమల బెడద నుంచి ప్రజలను రక్షించాలంటూ గ్రామ పంచాయతీ అధికారికి వినతి పత్రం సమర్పించింది.

గత నెల రోజులుగా గ్రామంలో దోమల సంఖ్య విపరీతంగా పెరిగిందని, ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత బయటకు రావడమే కష్టంగా మారిందని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. దోమల దాడులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ, రాత్రివేళల్లో ఇళ్లలో కూడా ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్న పరిస్థితి నెలకొంది.

డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే దోమలు అధికంగా పెరుగుతున్నాయని నాయకుడు నాగరాజు తెలిపారు. నిల్వ నీరు, శుభ్రత లోపం కారణంగా పరిస్థితి మరింత విషమంగా మారుతోందని అన్నారు.

ఈ నేపథ్యంలో వెంటనే దోమల మందును పిచికారి చేయించి, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని పంచాయతీ గ్రేడ్-6 సెక్రటరీ దాసరి మాధవరావుకు వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కరెడ్ల ధనలక్ష్మి, గద్దల రామకృష్ణ, వినుకొండ రంగారాణి, ఆడిమల్లి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.