BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

దోమల బెడదపై సిపిఎం ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Mar, 2026 - 05:16 PM
38 వీక్షణలు

దోమల బెడదపై సిపిఎం ఆందోళన – వెంటనే చర్యలు తీసుకోవాలని వినతి

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో రోజురోజుకూ పెరుగుతున్న దోమల సమస్యపై సిపిఎం మండల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. దోమల బెడద నుంచి ప్రజలను రక్షించాలంటూ గ్రామ పంచాయతీ అధికారికి వినతి పత్రం సమర్పించింది.

గత నెల రోజులుగా గ్రామంలో దోమల సంఖ్య విపరీతంగా పెరిగిందని, ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత బయటకు రావడమే కష్టంగా మారిందని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. దోమల దాడులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ, రాత్రివేళల్లో ఇళ్లలో కూడా ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్న పరిస్థితి నెలకొంది.

డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే దోమలు అధికంగా పెరుగుతున్నాయని నాయకుడు నాగరాజు తెలిపారు. నిల్వ నీరు, శుభ్రత లోపం కారణంగా పరిస్థితి మరింత విషమంగా మారుతోందని అన్నారు.

ఈ నేపథ్యంలో వెంటనే దోమల మందును పిచికారి చేయించి, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని పంచాయతీ గ్రేడ్-6 సెక్రటరీ దాసరి మాధవరావుకు వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కరెడ్ల ధనలక్ష్మి, గద్దల రామకృష్ణ, వినుకొండ రంగారాణి, ఆడిమల్లి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.