డ్రగ్స్ నివారణ అందరి బాధ్యత: మంచిర్యాల డీసీపీ భాస్కర్
గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసుల ప్రత్యేక నిఘా
ప్రజల సహకారం అవసరం
సమాజంలో డ్రగ్స్ నివారణ అనేది అందరి బాధ్యత అని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టేందుకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
బుధవారం జిల్లా కేంద్రంలో "పిల్లల భద్రత, డ్రగ్స్ అడ్డుకట్ట" అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గంజాయితో పాటు ఇతర ప్రమాదకర మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు వెల్లడించారు. యువత, సమాజ భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రజలందరూ పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన కోరారు.
ఈ అవగాహన కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్తో పాటు పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు