BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 23 March 2026, 10:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

డ్రోన్ కెమెరాలతో అక్రమాలపై పెనమలూరు పోలీసుల కఠిన నిఘా

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:21 PM
133 వీక్షణలు

డ్రోన్ కెమెరాలతో అక్రమాలపై పెనమలూరు పోలీసుల కఠిన నిఘా

పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చట్ట విరుద్ధ కార్యకలాపాలపై పోలీసులు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. వణుకూరు, వైకుంఠపురం ప్రాంతాల్లో కోడిపందాలు, పేకాట వంటి అక్రమాలు జరిగే అవకాశమున్న ప్రదేశాలను ముందస్తుగా గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు.

జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, గన్నవరం డిఎస్పీ శ్రీనివాసరావు, పెనమలూరు ఇన్స్పెక్టర్ వెంకటరమణ పర్యవేక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో డ్రోన్ కెమెరాల సహాయంతో అనుమానాస్పద ప్రాంతాలను గగనతలం నుండి పరిశీలిస్తూ పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.

అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో ముందస్తుగా కట్టడి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు చట్ట విరుద్ధ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద విషయాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.