www.ntodaynews.com
మేడారం సమ్మక్క–సారలమ్మ అమ్మవార్ల దర్శనం
తెలంగాణ
మేడారం సమ్మక్క–సారలమ్మ అమ్మవార్ల దర్శనం
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్నేహలత దంపతులు
NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్
ములుగు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్నేహలత దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
మొక్కుల సమర్పణ
అమ్మవార్ల గద్దెల వద్ద ఈశ్వర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనదేవతలకు పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమ్మవార్ల కృపతో తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, పుట్ట మధుకర్, కోరుకంటి చందర్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, పార్టీ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు, గంగుల అశోక్, మాజీ ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, పెంట రాజేష్, రాకేష్, ఏలేటి కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు.
#Medaram
#SammakkaSaralamma
#TempleVisit
#Telangana
#MuluguDistrict
#DevotionalNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube