BREAKING
బట్టలు ఆరేస్తూ విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి సాతులూరు గ్రామంలో యువకుడి కిడ్నాప్ కలకలం. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ భారీ వర్షాలు... చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం ఉప్పరపాలెం శివారులో జూదరుల అరెస్ట్ ​ఆరుగురు పట్టివేత.. జూన్‌లో 11 రోజులు బ్యాంకులకు సెలవులు పెదవేగి పోలీసులకు బొలెరో వాహనం అందజేత ఏలూరు జిల్లాలో కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు ఏఎన్‌ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం మయన్మార్ అధ్యక్షుడితో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ బట్టలు ఆరేస్తూ విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి సాతులూరు గ్రామంలో యువకుడి కిడ్నాప్ కలకలం. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ భారీ వర్షాలు... చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం ఉప్పరపాలెం శివారులో జూదరుల అరెస్ట్ ​ఆరుగురు పట్టివేత.. జూన్‌లో 11 రోజులు బ్యాంకులకు సెలవులు పెదవేగి పోలీసులకు బొలెరో వాహనం అందజేత ఏలూరు జిల్లాలో కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు ఏఎన్‌ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం మయన్మార్ అధ్యక్షుడితో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
www.ntodaynews.com

టైర్ల కంపెనీ మూసివేయాలని డిమాండ్

తెలంగాణ
23 Feb, 2026 - 10:14 PM
261 వీక్షణలు
టైర్ల కంపెనీ మూసివేయాలని రంగాపూర్ గ్రామస్తుల డిమాండ్ NTODAY NEWS: బొమ్మలరామారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం రంగాపురం గ్రామానికి సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న టైర్ల కంపెనీని తక్షణమే మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మెరుపు చెరువు కట్ట వెనుక భాగంలో ఎన్ అండ్ ఎన్ పేరుతో నిర్వహిస్తున్న టైర్ల కంపెనీ నుంచి అధికంగా పొగ, కాలుష్యం వెలువడుతోందని గ్రామస్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామస్థులు మాట్లాడుతూ, వందలాది టైర్లు కాల్చడం వల్ల వచ్చే దుర్వాసనతో తరచూ జలుబు, అలర్జీ వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. అనుమతులు లేకుండా చిన్న స్థాయిలో ప్రారంభించిన యూనిట్‌ను విస్తరించడం వల్ల కాలుష్యం మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పైరాలసిస్ పరిశ్రమలకు అనుమతులు ఎలా ఇస్తున్నారో స్పష్టత ఇవ్వాలని కోరారు. కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని, జీవించే హక్కును హరిస్తున్న ఈ యూనిట్‌పై తక్షణ చర్యలు తీసుకుని మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మైలారం జంగయ్య, వార్డు సభ్యులు ఠాకూర్ రాజేందర్ సింగ్, ప్రవీణ్, లక్ష్మారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. #Bommalaramaram #YadadriBhuvanagiri #PollutionIssue #PublicHealth #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube