BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 23 February 2026, 10:14 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

టైర్ల కంపెనీ మూసివేయాలని డిమాండ్

తెలంగాణ
23 Feb, 2026 - 10:14 PM
353 వీక్షణలు
టైర్ల కంపెనీ మూసివేయాలని రంగాపూర్ గ్రామస్తుల డిమాండ్ NTODAY NEWS: బొమ్మలరామారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం రంగాపురం గ్రామానికి సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న టైర్ల కంపెనీని తక్షణమే మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మెరుపు చెరువు కట్ట వెనుక భాగంలో ఎన్ అండ్ ఎన్ పేరుతో నిర్వహిస్తున్న టైర్ల కంపెనీ నుంచి అధికంగా పొగ, కాలుష్యం వెలువడుతోందని గ్రామస్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామస్థులు మాట్లాడుతూ, వందలాది టైర్లు కాల్చడం వల్ల వచ్చే దుర్వాసనతో తరచూ జలుబు, అలర్జీ వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. అనుమతులు లేకుండా చిన్న స్థాయిలో ప్రారంభించిన యూనిట్‌ను విస్తరించడం వల్ల కాలుష్యం మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పైరాలసిస్ పరిశ్రమలకు అనుమతులు ఎలా ఇస్తున్నారో స్పష్టత ఇవ్వాలని కోరారు. కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని, జీవించే హక్కును హరిస్తున్న ఈ యూనిట్‌పై తక్షణ చర్యలు తీసుకుని మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మైలారం జంగయ్య, వార్డు సభ్యులు ఠాకూర్ రాజేందర్ సింగ్, ప్రవీణ్, లక్ష్మారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. #Bommalaramaram #YadadriBhuvanagiri #PollutionIssue #PublicHealth #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube