BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 05 March 2026, 09:15 am
Posted by : NTODAY NEWS OFFICIAL

గొర్రెల కాపరులను ఆదుకోవాలని డిమాండ్

తెలంగాణ
05 Mar, 2026 - 09:15 AM
364 వీక్షణలు
తొక్కిసలాటలో 80 గొర్రెల మృతి.. గొర్రెల కాపరులను ఆదుకోవాలని డిమాండ్ NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున బనగానపల్లె మండలం నందవరం గ్రామంలోని ఏస్‌ఆర్‌బీసీ కాలువ సమీపంలో జరిగిన ఘటనలో సుమారు 80 గొర్రెలు తొక్కిసలాటలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. నీరు తాగేందుకు వెళ్లిన సమయంలో గొర్రెలు ఒక్కదాని మీద ఒకటి పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బేతంచర్ల మండలం బుగ్గాన్నిపల్లె గ్రామానికి చెందిన బక్క నాగేష్, పర్లపాటి శేఖర్, మల్లికార్జున, ఆంజనేయులు మరియు ఇతర గొర్రెల కాపరుల గొర్రెలు ఈ ఘటనలో మృతి చెందాయి. జీవనోపాధి కోసం ఇతర గ్రామాలకు వచ్చి గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్న ఈ రైతులకు ఇది భారీ నష్టం కలిగించింది. ఈ ఘటనపై బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణ యాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన గొర్రెలను ఒక విపత్తుగా గుర్తించి జిల్లా కలెక్టర్ వెంటనే బాధిత గొర్రెల కాపరులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ప్రకటించి వారికి ఆర్థిక సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే స్థానిక అధికారులు బాధితులను కలుసుకుని వారికి మనోధైర్యం కల్పించాలని సూచించారు. ఘటన అనంతరం గొర్రెల కాపరులతో ఫోన్‌లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పినట్లు శివకృష్ణ యాదవ్ తెలిపారు. #Banaganapalle #Nandavaram #ShepherdsLoss #LivestockLoss #ShivakrishnaYadav #AndhraPradeshNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube