www.ntodaynews.com
గొర్రెల కాపరులను ఆదుకోవాలని డిమాండ్
తెలంగాణ
తొక్కిసలాటలో 80 గొర్రెల మృతి.. గొర్రెల కాపరులను ఆదుకోవాలని డిమాండ్
NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున
బనగానపల్లె మండలం నందవరం గ్రామంలోని ఏస్ఆర్బీసీ కాలువ సమీపంలో జరిగిన ఘటనలో సుమారు 80 గొర్రెలు తొక్కిసలాటలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. నీరు తాగేందుకు వెళ్లిన సమయంలో గొర్రెలు ఒక్కదాని మీద ఒకటి పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
బేతంచర్ల మండలం బుగ్గాన్నిపల్లె గ్రామానికి చెందిన బక్క నాగేష్, పర్లపాటి శేఖర్, మల్లికార్జున, ఆంజనేయులు మరియు ఇతర గొర్రెల కాపరుల గొర్రెలు ఈ ఘటనలో మృతి చెందాయి. జీవనోపాధి కోసం ఇతర గ్రామాలకు వచ్చి గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్న ఈ రైతులకు ఇది భారీ నష్టం కలిగించింది.
ఈ ఘటనపై బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణ యాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన గొర్రెలను ఒక విపత్తుగా గుర్తించి జిల్లా కలెక్టర్ వెంటనే బాధిత గొర్రెల కాపరులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ప్రకటించి వారికి ఆర్థిక సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అలాగే స్థానిక అధికారులు బాధితులను కలుసుకుని వారికి మనోధైర్యం కల్పించాలని సూచించారు. ఘటన అనంతరం గొర్రెల కాపరులతో ఫోన్లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పినట్లు శివకృష్ణ యాదవ్ తెలిపారు.
#Banaganapalle #Nandavaram #ShepherdsLoss #LivestockLoss #ShivakrishnaYadav #AndhraPradeshNews #NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube