BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

గొర్రెల కాపరులను ఆదుకోవాలని డిమాండ్

తెలంగాణ
05 Mar, 2026 - 09:15 AM
226 వీక్షణలు
తొక్కిసలాటలో 80 గొర్రెల మృతి.. గొర్రెల కాపరులను ఆదుకోవాలని డిమాండ్ NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున బనగానపల్లె మండలం నందవరం గ్రామంలోని ఏస్‌ఆర్‌బీసీ కాలువ సమీపంలో జరిగిన ఘటనలో సుమారు 80 గొర్రెలు తొక్కిసలాటలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. నీరు తాగేందుకు వెళ్లిన సమయంలో గొర్రెలు ఒక్కదాని మీద ఒకటి పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బేతంచర్ల మండలం బుగ్గాన్నిపల్లె గ్రామానికి చెందిన బక్క నాగేష్, పర్లపాటి శేఖర్, మల్లికార్జున, ఆంజనేయులు మరియు ఇతర గొర్రెల కాపరుల గొర్రెలు ఈ ఘటనలో మృతి చెందాయి. జీవనోపాధి కోసం ఇతర గ్రామాలకు వచ్చి గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్న ఈ రైతులకు ఇది భారీ నష్టం కలిగించింది. ఈ ఘటనపై బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణ యాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన గొర్రెలను ఒక విపత్తుగా గుర్తించి జిల్లా కలెక్టర్ వెంటనే బాధిత గొర్రెల కాపరులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ప్రకటించి వారికి ఆర్థిక సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే స్థానిక అధికారులు బాధితులను కలుసుకుని వారికి మనోధైర్యం కల్పించాలని సూచించారు. ఘటన అనంతరం గొర్రెల కాపరులతో ఫోన్‌లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పినట్లు శివకృష్ణ యాదవ్ తెలిపారు. #Banaganapalle #Nandavaram #ShepherdsLoss #LivestockLoss #ShivakrishnaYadav #AndhraPradeshNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube