BREAKING
ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి ఘనంగా మురళి మోహన్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్లతో గట్టి నిఘా:- జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఏపీ ఖజానాకు కాసుల వర్షం రికార్డు స్థాయిలో GST వసూళ్లు! తెలంగాణలో అమల్లోకి వచ్చిన న్యాయవాదుల రక్షణ చట్టం ​మందమర్రి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి ఘనంగా మురళి మోహన్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్లతో గట్టి నిఘా:- జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఏపీ ఖజానాకు కాసుల వర్షం రికార్డు స్థాయిలో GST వసూళ్లు! తెలంగాణలో అమల్లోకి వచ్చిన న్యాయవాదుల రక్షణ చట్టం ​మందమర్రి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన
www.ntodaynews.com

అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి

తెలంగాణ
17 Feb, 2026 - 11:10 AM
56 వీక్షణలు
అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వివిధ పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో మంజూరైన పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో, ఎంత మేర నిధులు ఖర్చయ్యాయో, ఎక్కడెక్కడ సదుపాయాల పునరుద్ధరణ జరిగిందో అధికారులను ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో నిర్మాణంలో ఉన్న ‘శక్తి భవన్’ పనులను వేగవంతం చేసి మహిళా దినోత్సవం నాటికి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతోందో వివరణ కోరిన కలెక్టర్, కాంట్రాక్టర్లతో ఒప్పందాలు ఉన్నప్పటికీ ఆలస్యం అస్సలు సహించబోమని హెచ్చరించారు. ప్రజల సౌకర్యాల విషయంలో రాజీపడకూడదని, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులను విభాగాల వారీగా సమన్వయంతో చేపట్టి, గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. తదుపరి సమీక్ష నాటికి స్పష్టమైన పురోగతి కనిపించాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. #YadadriBhuvanagiri #DistrictReview #DevelopmentWorks #PublicInfrastructure #TelanganaNews #Governance Follow us on Website Facebook Instagram YouTube