BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి

తెలంగాణ
17 Feb, 2026 - 11:10 AM
102 వీక్షణలు
అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వివిధ పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో మంజూరైన పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో, ఎంత మేర నిధులు ఖర్చయ్యాయో, ఎక్కడెక్కడ సదుపాయాల పునరుద్ధరణ జరిగిందో అధికారులను ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో నిర్మాణంలో ఉన్న ‘శక్తి భవన్’ పనులను వేగవంతం చేసి మహిళా దినోత్సవం నాటికి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతోందో వివరణ కోరిన కలెక్టర్, కాంట్రాక్టర్లతో ఒప్పందాలు ఉన్నప్పటికీ ఆలస్యం అస్సలు సహించబోమని హెచ్చరించారు. ప్రజల సౌకర్యాల విషయంలో రాజీపడకూడదని, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులను విభాగాల వారీగా సమన్వయంతో చేపట్టి, గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. తదుపరి సమీక్ష నాటికి స్పష్టమైన పురోగతి కనిపించాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. #YadadriBhuvanagiri #DistrictReview #DevelopmentWorks #PublicInfrastructure #TelanganaNews #Governance Follow us on Website Facebook Instagram YouTube