ఢిల్లీలో స్వైన్ ఫ్లూ విజృంభణ.. 1,777కు చేరిన హెచ్1ఎన్1 కేసులు
ఢిల్లీలో స్వైన్ ఫ్లూ విజృంభణ.. 1,777కు చేరిన హెచ్1ఎన్1 కేసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1) కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు నగరంలో 1,777కు పైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లే సమయంలో మాస్కులు ధరించాలని, దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు నోరు, ముక్కును కప్పుకోవాలని ఆరోగ్యశాఖ సూచనలు జారీ చేసింది. అనవసరంగా కళ్లు, ముక్కు, నోటిని తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
తరచూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు ఆరోగ్య మార్గదర్శకాలను పాటించాలని కోరారు.