BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

ఢిల్లీలో స్వైన్ ఫ్లూ విజృంభణ.. 1,777కు చేరిన హెచ్1ఎన్1 కేసులు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 05:21 PM
21 వీక్షణలు

ఢిల్లీలో స్వైన్ ఫ్లూ విజృంభణ.. 1,777కు చేరిన హెచ్1ఎన్1 కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1) కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు నగరంలో 1,777కు పైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లే సమయంలో మాస్కులు ధరించాలని, దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు నోరు, ముక్కును కప్పుకోవాలని ఆరోగ్యశాఖ సూచనలు జారీ చేసింది. అనవసరంగా కళ్లు, ముక్కు, నోటిని తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

తరచూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు ఆరోగ్య మార్గదర్శకాలను పాటించాలని కోరారు.