ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సీపీఐ నిరసన ప్రదర్శన
ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సీపీఐ నిరసన ప్రదర్శన
కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులు, ఇంధన ధరలను విచ్చలవిడిగా పెంచడాన్ని నిరసిస్తూ బుధవారం నస్పూర్లోని మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ మరియు నిత్యావసర సరుకుల ధరల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతర ధరల పెరుగుదల సామాన్యుడి జీవనాన్ని దుర్భరంగా మార్చిందని వారు విమర్శించారు.
ప్రజలపై మోపిన ఈ అదనపు భారాలను తగ్గించేలా, పెంచిన ధరలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ నాయకులతో పాటు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు